Total Pageviews

Saturday, August 21, 2010

dayyamante meku bhayama

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్కోన్ సమీపంలోని బైడా గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్తులు తెలియని వ్యాధి బారిన పడి ఉన్నట్లుండి మరణించారు. అయితే వీరి చావుకు కారణాలు తెలియని గ్రామస్తులు... స్థానిక మంత్రగాడిని సంప్రదించారు. వీరి చావుకు ఒ దెయ్యం కారణమని అతడు చెప్పాడు. పైగా, సరైన చర్య తీసుకోకపోతే ఆ దెయ్యం ఇతరులను కూడా పట్టి పీడిస్తుందని ఆ మంత్రగాడు హెచ్చరించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు అతనిని దెయ్యం బెడద వదిలించమని అభ్యర్థించారు. దీంతో అతను దెయ్యాల నుంచి ఊరు బయటపడే మార్గం చెప్పాడు. 

గ్రామంలో దెయ్యం వచ్చి చేరిందని చెప్పిన ఆ మాంత్రికుడు ఆ గ్రామానికి సంబంధించని ప్రజలను వెంటనే ఊరినుంచి వెళ్లిపోవలసినదిగా ఆదేశించాడు. మిగిలిన గ్రామస్తులు తాను ఊరి గుడిలో చేపట్టే పూజా కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని హుకుం జారీ చేశాడు. 


చిట్టచివరకు గ్రామం నుంచి దెయ్యాన్ని పారదోలే ప్రక్రియ ప్రారంభమైంది. మంత్రగాడు విచిత్రమైన చేష్టలు మొదలెట్టాడు. ఇతరులు చూడగానే భయంతో కంపించిపోయే రకం బట్టలు ధరించి, ఆ ఊరు చుట్టూ పాలు పోసి గీత గీశాడు. చివరగా ఆ ఊరునుంచి దెయ్యాలను వదలగొట్టేశానని ప్రకటించేశాడు. దీంతో గ్రామస్తులు అతడిని పొగడటం మొదలెట్టారు.
WD


మానవ స్వభావమే అంత. తనకు తెలియని, తనకు అర్థంకాని విషయాల వద్దకు వచ్చేసరికి మనిషి తప్పనిసరిగా వాటికి అతీత శక్తులతో ముడిపెట్టడం మొదలెడుతాడు. అయితే దీన్ని ఒక అవకాశంగా తీసుకుని స్వప్రయోజనాలకోసం ఉపయోగించుకునే వారు ఎక్కడైనా సరే తయారై ఉంటారు. అమాయకుల నమ్మకాలను వీరు తమకు అనువుగా మలుచుకుంటారు. ఒక్కోసారి ఇది ఇలాంటివారికి పెద్ద ఆదాయవనరుగా మారుతుంది కూడా.

ఇంతకూ.. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు... ఇలాంటి విషయాలను మీరు నమ్ముతున్నారా... మీ అభిప్రాయం మాకు తప్పక రాయండి..

డి


WD PhotoWD
గోవింద నామ స్మరణం సర్వపాపహరణం. ఏడుకొండల వాడా, వెంకటరమణా, గోవిందా, గోవిందా అని పిలుచుకుంటూ భక్తులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకుంటారు. స్వామివారి దర్శనం క్షణ కాలం లభించిన కాలం, జన్మ ధన్యమైపోయిందన్న భావనతో భక్తులు వారి స్వస్థలాలకు చేరుకుంటూ ఉంటారు. సైన్సులో పేర్కొన్న గురుత్వాక్షరణ శక్తిని మించిన ఆధ్యాత్మిక శక్తితో మూర్తీభవించిన దైవ శక్తిగా మహావిష్ణువు మరో అవతారంగా తిరుమలలో వెలసిన శ్రీవారిని దర్శించేందుకు వస్తున్న భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి 50,000 మంది భక్తులు వస్తుంటారు. పర్వదినాలు, దేవాలయ ఉత్సవాల సమయంలో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. 

స్థల పురాణం:
ఏడు పడగల ఆదిశేషుని పోలి ఉండే రీతిలో అగుపించే ఏడు కొండలలో ఒకటైన వెంకటాద్రి పర్వతంపై స్వామి అవతరించారు. ఒకానొక పురాణాన్ని అనుసరించి క్రీస్తు శకం 11వ శతాబ్దంలో జన్మించిన రామానుజాచార్యులవారు ఏడు కొండలను ఎక్కుతుండగా శ్రీనివాసునిగా పిలవబడే శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఆయనను ఆశీర్వదించినట్లు చెప్పబడింది. స్వామి ఆశీర్వాదంతో 120 సంవత్సరాలు జీవించిన రామానుజాచార్యులవారు స్వామి వారి లీలలను ప్రపంచానికి చాటి చెప్పారు. వైకుంఠ ఏకాదశినాడు స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. అందుకు అనుగుణంగా ఆరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శించుకుని మోక్షమార్గాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. 

దేవాలయ చరిత్ర: 
దేవాలయ చరిత్రను పరిశీలించినట్లయితే... కాంచీపురాన్ని పరిపాలిస్తున్న పల్లవరాజులు క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినట్లు
WD PhotoWD
చెప్పబడింది. కానీ 15వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలన వరకు కూడా దేవాలయం ప్రాచుర్యం పొందలేదు. వారి పాలనలో దేవాలయం అత్యంత ప్రాచుర్యం పొందింది. అనంతర కాలంలో హాతీరామ్‌జీ మఠానికి చెందిన మహంత్‌లు దేవాలయ నిర్వహణ బాధ్యతలను చూసుకునేవారు. 

తరువాత మద్రాసు రాష్ట్రం 1933లో స్వయంప్రతిపత్తి గల ఒక పాలకవర్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పేరిట ఏర్పాటు చేసింది. తదనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ధర్మకర్తలతో పాలక మండలిని ప్రభుత్వం నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఒక కార్యనిర్వహణాధికారి దేవాలయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు.
డి

భారతదేశపు అత్యంత పవిత్రమైన గంగా నదీ తూర్పు పరివాహక ప్రాంతంలో కొలువుదీరి ప్రపంచంలోనే అతిపురాతనమైన నగరంగా పేరొందిన వారణాసి భారతదేశపు సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతోంది. వారణాసి నగరం నడిబొడ్డులో నెలకొన్న కాశీ విశ్వనాథ దేవాలయం శైవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కాశీ విశ్వేశ్వర దేవాలయం సంప్రాప్తించుకుంది. 

స్త్రీ పురుషులు, పిల్లలు వృద్ధులు అనే తారతమ్యాలుకు చోటు లేకుండా, కులమతాలకు అతీతంగా ఎవరైనా కావచ్చు వారాణాశిని సందర్శించి గంగా నదిలో స్నానం చేసినట్లయితే మోక్షాన్ని పొందుతారని హిందూ పురాణేతిహాసాలు పేర్కొంటున్నాయి. కనుకనే జీవితకాలంలో ఒక్కసారైనా కాశీని సందర్శించాలనేది హిందువుల జీవితేచ్చ. 

ధార్మిక ప్రాధాన్యత 
భూగోళం అవతరించిన సమయంలో తొలి కాంతి కిరణం కాశీపై పడింది. అప్పటి నుంచి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అంశాల నెలవుగా పుణ్య క్షేత్రమైన కాశీ పేరుగాంచింది. పురాణాలను అనుసరించి అనేక సంవత్సారాలు ప్రవాసంలో గడిపిన పరమశివుడు వారాణాసికి విచ్చేసి తన నివాసంగా మార్చుకున్నాడని ప్రతీతి. పది అశ్వాలతో కూడిన రథాన్ని దశాశ్వమేథ ఘాట్‌కు పంపడం ద్వారా బ్రహ్మదేవుడు బోళాశంకరునికి స్వాగతం పలికాదు