Total Pageviews

Saturday, August 21, 2010


డి


WD PhotoWD
గోవింద నామ స్మరణం సర్వపాపహరణం. ఏడుకొండల వాడా, వెంకటరమణా, గోవిందా, గోవిందా అని పిలుచుకుంటూ భక్తులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకుంటారు. స్వామివారి దర్శనం క్షణ కాలం లభించిన కాలం, జన్మ ధన్యమైపోయిందన్న భావనతో భక్తులు వారి స్వస్థలాలకు చేరుకుంటూ ఉంటారు. సైన్సులో పేర్కొన్న గురుత్వాక్షరణ శక్తిని మించిన ఆధ్యాత్మిక శక్తితో మూర్తీభవించిన దైవ శక్తిగా మహావిష్ణువు మరో అవతారంగా తిరుమలలో వెలసిన శ్రీవారిని దర్శించేందుకు వస్తున్న భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి 50,000 మంది భక్తులు వస్తుంటారు. పర్వదినాలు, దేవాలయ ఉత్సవాల సమయంలో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. 

స్థల పురాణం:
ఏడు పడగల ఆదిశేషుని పోలి ఉండే రీతిలో అగుపించే ఏడు కొండలలో ఒకటైన వెంకటాద్రి పర్వతంపై స్వామి అవతరించారు. ఒకానొక పురాణాన్ని అనుసరించి క్రీస్తు శకం 11వ శతాబ్దంలో జన్మించిన రామానుజాచార్యులవారు ఏడు కొండలను ఎక్కుతుండగా శ్రీనివాసునిగా పిలవబడే శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఆయనను ఆశీర్వదించినట్లు చెప్పబడింది. స్వామి ఆశీర్వాదంతో 120 సంవత్సరాలు జీవించిన రామానుజాచార్యులవారు స్వామి వారి లీలలను ప్రపంచానికి చాటి చెప్పారు. వైకుంఠ ఏకాదశినాడు స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. అందుకు అనుగుణంగా ఆరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శించుకుని మోక్షమార్గాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. 

దేవాలయ చరిత్ర: 
దేవాలయ చరిత్రను పరిశీలించినట్లయితే... కాంచీపురాన్ని పరిపాలిస్తున్న పల్లవరాజులు క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినట్లు
WD PhotoWD
చెప్పబడింది. కానీ 15వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలన వరకు కూడా దేవాలయం ప్రాచుర్యం పొందలేదు. వారి పాలనలో దేవాలయం అత్యంత ప్రాచుర్యం పొందింది. అనంతర కాలంలో హాతీరామ్‌జీ మఠానికి చెందిన మహంత్‌లు దేవాలయ నిర్వహణ బాధ్యతలను చూసుకునేవారు. 

తరువాత మద్రాసు రాష్ట్రం 1933లో స్వయంప్రతిపత్తి గల ఒక పాలకవర్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పేరిట ఏర్పాటు చేసింది. తదనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ధర్మకర్తలతో పాలక మండలిని ప్రభుత్వం నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఒక కార్యనిర్వహణాధికారి దేవాలయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు.
డి

No comments:

Post a Comment